LATEST NEWS IN ANANTAPURAM ~ AP OVERVIEW

AndraPradhesh Overview

Sunday 5 February 2017

LATEST NEWS IN ANANTAPURAM

  SAD NEWS IN ANANTAPURAM 


LATEST NEWS IN ANDRAPRADESH


అనంతపురం: జిల్లాలోని మడకశిర మండలం మేలవాయిలో దారుణం జరిగింది. పావగడ నుంచి మధుగిరికి విద్యుత్‌ లైన్‌ వేస్తున్న అధికారులు దుర్మర్గంగా ప్రవర్తించారు. తమకు నష్టపరిహారం ఇవ్వలేదంటూ విద్యుత్‌ తీగలను పట్టుకొని నిరసన తెలుపుతున్న రైతులను అమానుషంగా హింసించారు. విద్యుత్‌ తీగలను పట్టుకొని తండ్రీకొడులు నిరసన తెలుపుతుండగా.. జేసీబీతో అధికారులు ఆ తీగలను పైకి లాగారు. దీంతో తీగలకు వేలాడుతున్న తండ్రీకొడుకులు పైనుంచి కిందపడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సంచలనం రేపుతున్నాయి. అధికారుల నిర్లక్ష్య ధోరణిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

రూ. 5 లక్షలకు బదులు రూ. 90వేలు మాత్రమే ఇచ్చారని పేర్కొంటూ తండ్రీకొడుకులు పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారు విద్యుత్‌ తీగలను పట్టుకొని నిరసన తెలిపారు. వారిని ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు జేసీబీతో విద్యుత్‌ తీగలను పైకిలాగడంతో వారు అలాగే విద్యుత్‌ తీగలకు వేలాడుతూ పైకి వెళ్లిపోయారు. పైనుంచి పడటంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికంగా నిరసన వ్యక్తమవుతోంది.


0 comments:

Post a Comment